Monday 24 August 2020

పెసరపచ్చడి

 విధానము .

100  గ్రాముల పెసర పప్పును ఒక  గిన్నెలోకి తీసుకుని ఒకసారి  నీటితో  కడిగి , అందులో  పప్పు మునిగే  వరకు  నీళ్ళను పోసి  రెండు గంటల  సేపు  నాన బెట్టుకోవాలి.

తర్వాత  నీటిని  పారబోసి   పప్పును  వడగట్టు కోవాలి.

ఇప్పుడు  మిక్సీ లో  పది ఎండుమిరపకాయలు ,  ముప్పాను స్పూను జీలకర్ర , పావును స్పూనులో సగం ఇంగువను మరియు తగినంత  ఉప్పును   వేసుకుని మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి.

తర్వాత  అందులో  నానబెట్టిన పెసరపప్పును మరియు  కొద్దిగా  నీళ్ళు  కూడా వేసుకుని  మరీ మెత్తగా  కాకుండా  మిక్సీ  వేసుకోవాలి .

తర్వాత  ఈ పచ్చడిని  వేరే గిన్నెలోకి  తీసుకోవాలి .

పెసరపప్పు  అంటే ఏమిటని  కొందరు అడుగుతున్నారు. పై పొట్టు తీసిన పెసర పప్పును  చాయపెసరపప్పు  అని కూడా అంటారు.

అంతే. భోజనము లోకి ఎంతో  రుచిగా ఉండే పెసరపప్పు పచ్చడి రెడీ. కొందరు  ఈ పచ్చడితో  అట్టు వేసుకుని  వేడి వేడి అన్నంలో  నెయ్యి  వేసుకుని  నంచుకుని  తింటారు. ఇంగువ వాసనతో  ఈ దోశెలు కూడా  భోజనము లోకి  చాలా రుచిగా  ఉంటాయి

No comments:

Post a Comment