Wednesday 19 August 2020

కందిపొడి

స్టౌ  మీద  బాండీ పెట్టుకుని అందులో ఒక పావు కిలో కందిపప్పు , 20 ఎండుమిరపకాయలు , రెండు స్పూన్లు  జీలకర్ర  వేసుకుని , నూనె  వేయకుండా  కంది పప్పు  మాడకుండా అట్లకాడతో  కదుపుతూ, కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి.

చల్లారగానే మిక్సీ లో ఈ మిశ్రమమును వేసుకుని  అందులో  పావు స్పూను ఇంగువను మరియు  తగినంత  ఉప్పును వేసుకుని  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి.

తర్వాత ఈ పొడిని  ఒక బేసిన్ లో వేసుకుని  చేతితో  బాగా కలుపుకుని  ఒక సీసాలోకి  తీసుకోవాలి .

ఈ కందిపొడి  మూడు నెలలు  నిల్వ ఉంటుంది.

వేడి వేడి  అన్నంలో  నెయ్యి కాని , పప్పు నూనె కాని  వేసుకుని  తింటే  చాలా రుచిగా ఉంటుంది.

ఈ పొడికి  కాంబినేషన్ గా దోసావకాయ కాని , కొత్తావకాయ  కాని , పచ్చి పులుసు కాని  చాలా రుచిగా  ఉంటుంది.

No comments:

Post a Comment