Saturday 29 December 2018

ఆలూ ఫింగర్స్

ఉడికించిన బంగాళా దుంపల ముద్దలో , ఉడికించించిన రవ్వ కూడా కలపి, ఉప్పు, కారం, మసాలా, వాము, కొత్తిమీర వేసి బాగా కలపి చేతికి నూనె రాసుకుని కొంచం ఆ mixture తీసుకుని పొడుగ్గా ఫింగర్స్ ల చేసుకుని వేడి వేడి నూనె లో కొన్ని కొన్ని వేసే బాగా డీప్ ఫ్రై చేయాలి.

Monday 17 December 2018

పొంగలి

పొంగల్ . (  Ven  Pongal  )

తమిళ నాడు  అంతటా  ప్రతి రోజు  హోటళ్ళలో ఉప్మా  చేయరు.
పొంగల్  చేస్తారు .

కారణం  బొంబాయి రవ్వ , మైదా  పిండి  ఆరోగ్యరిత్యా  తగు  మోతాదులో   ఉపయోగించు  కోవాలని  అందరూ  చెప్తున్నారు .

ఈ  పొంగల్  బియ్యముతో  చేసుకుంటారు  కాబట్టి  ఆరోగ్యానికి  చాలా  మంచిది .

ఇంక  పొంగల్  తయారు  చేయడానికి  కావలసిన  వస్తువులు .

బియ్యము  --  ఒక  గ్లాసు
చాయపెసరపప్పు  --  అర  గ్లాసు
మిరియాలు  --   ఒకటిన్నర   స్పూను .
నెయ్యి  ---   ఒక  చిన్న  కప్పు.
ఉప్పు  --   తగినంత
అల్లం తరుగు  --  ఒకటిన్నర   స్పూను  జీలకర్ర   --  అర  స్పూను .
జీడిపప్పు  ---  30  గ్రాములు
కరివేపాకు   -  మూడు  రెమ్మలు 
పచ్చిమిర్చి   --  ఐదు  పొడుగ్గా   తరుగు కోవాలి .
ఇంగువ  ---   కొద్దిగా

ముందుగా  బియ్యాన్ని  , పెసరపప్పును  మునిగే వరకు  నీళ్ళు పోసి ఒక  గంట సేపు విడి  విడిగా  నానబెట్టు కోవాలి .

స్టౌ  వెలిగించి  బాండీ  పెట్టుకొని  మూడు  స్పూన్లు  నెయ్యి  వేసి   జీడిపప్పు ను  వేయించుకొని  పక్కన  పెట్టుకోవాలి .  

మిరియాలను  కొంచెం  కచ్చా పచ్చాగా  దంచుకొని  ఒక  ప్లేటులో  పెట్టుకోండి.

అదే  బాండిలో  మరో  రెండు స్పూన్లు   నెయ్యి వేసి  దంచి  పెట్టుకున్న  మిరియాలు  , జీలకర్ర  , అల్లం తరుగు ,  ఇంగువ , పచ్చి  మిర్చి  , కరివేపాకు  వేసి  పోపు వేగాక  ఒకటి  మూడు  చొప్పున  నీళ్ళు పోసి   అందులో  తగినంత   ఉప్పు వేసి అదే  నీళ్ళలో  నానబెట్టి  ఉంచుకున్న   బియ్యము  పెసరపప్పు  వేసి  మూత పెట్టి  మెత్తగా   ఉడకనివ్వాలి .

దింప బోయే  ముందు  మిగిలిన  నెయ్యి ,  వేయించి  ప్రక్కన  పెట్టుకున్న  జీడిపప్పు   వేసి  మరో  మూడు  నిముషాలు  ఉంచి  దింపు కోవాలి .

వేడి  వేడి  పొంగల్  సర్వింగ్  కు సిద్ధం .

ఇందులోకి  కొబ్బరి  చట్నీ ,  టమోటో  చట్నీ  రెండూ  బాగుంటాయి .

తమిళనాడు  అంతటా  అన్ని హోటళ్ళలోనూ  చక్కగా  లేత  అరిటాకు వేసి  పొంగల్  పెట్టి   పై రెండు  చట్నీలు  వేసి , వేడి  వేడిగా  పొగలు  కక్కుతున్న  సాంబారు  వేస్తారు .

ఎంత  రుచిగా  ఉంటుందో  !

మళ్ళీ  మధ్యాహ్నము  ఒంటి గంట  దాకా  ఆకలి  వెయ్యదు .

Tuesday 11 December 2018

మీగడ జంతికలు

బియ్యపు పిండితో రుచికరమైన మీగడ చక్కిలాలు /  జంతికలు .

ఆలూరుకృష్ణప్రసాదు .

బియ్యపు పిండితో  మీగడ  చక్కిలాలు.

కావలసినవి .

మర పట్టించిన బియ్యపు  పిండి --  నాలుగు  కప్పులు.

బియ్యము  నాన పెట్టే అవసరం లేదు.

మామూలు బియ్యమే  మర పట్టించాలి.

మీగడతో ఉన్న పెరుగు  --  ఒక కప్పు.

(  జంతికలు  పుల్లగా  తినడానికి  ఇష్ట పడే వారు  పుల్లని మీగడ పెరుగు  వేసుకోవచ్చును. )

మీగడ  పెరుగు  లభ్యం కాని యెడల  50 గ్రాముల  వెన్న  పిండి కలిపే సమయంలో వేసుకుని , మామూలు పెరుగు వేసుకుని  పిండి కలుపు కోవచ్చు.

ఉప్పు  -- తగినంత

కారము  -- ఒక స్పూను

వాము   --  ఒక  స్పూను

నువ్వుపప్పు  -  ఒక  స్పూను

నూనె   --  350  గ్రాములు.

తయారీ  విధానము .

ఒక  బెసిన్లో మెత్తగా  మరపట్టించి జల్లెడ పోసుకున్న   బియ్యపు  పిండి ,  వాము , నువ్వుపప్పు , కారం,  వేసుకుని  అందులో  మీగడ పెరుగు / లేదా  వెన్న  మరియు పెరుగు వేసుకుని  తగినంత  ఉప్పు వేసుకుని చేతితో  బాగా  కలుపు కోవాలి .

ఇప్పుడు  అవసరమైతే కొద్దిగా   నీళ్ళు పోసుకుంటూ  చక్కిలాలు  వేయటానికి  వీలుగా  పిండిని  గట్టిగా  కలుపుకోవాలి .

తర్వాత   కలిపిన  పిండిని  బాగా మెదాయించుకోవాలి.

ఇప్పుడు   స్టౌ  వెలిగించి   బాండి పెట్టుకుని  మొత్తము   నూనె  పోసి  నూనెను  పొగలు  వచ్చే విధముగా  బాగా  కాగనివ్వాలి.

తర్వాత  పిండిని  చక్కిలాలు  వేసుకునే  గిద్దలో  పెట్టుకుని  స్టౌ ను  మీడియం  సెగలో  పెట్టి  రెండు  రెండు  చొప్పున  చక్కిలాలు నూనెలో వేసుకుని బంగారు  రంగులో  వేయించుకుని  తీసేసుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా ఉండే చల్ల చక్రాలు /  మీగడ చక్రాలు  అల్పాహారానికి  సిద్ధం.

ఈ  చక్కిలాలు  పది రోజులు   పైన నిల్వ ఉంటాయి.