నిమ్మకాయలు కడిగి ఆరబెట్టాలి. తరువాత ఒకొక్క కాయని నాలుగు లేదా ఎనిమిది ముక్కలు చేసి, తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. 3వ రోజు ఉదయం ముక్కలు చేత్తో గట్టిగా పిండి ఎండలో పెట్టాలి. అలాగే ఊరిన రసం కూడా వేరేగా వెడల్పాటి గిన్నెలో పోసి ఎండలో పెట్టాలి. అలా రెండు మూడు రోజులు ఎండ పెట్టాలి. ఆ తర్వాత, ఒక చెంచాడు మెంతులు వేయించి, పొడి చేసుకోవాలి. అపుడు మూకుడులో గరిటెడు నూనె పోసి కాగాక అందులో ఆవాలు, మెంతులు వేయించి పక్కన పెట్టుకోవాలి. కొద్ది సేపు తరువాత అందులో కారం పొడి తగినంత వేసి కలిపి దించేయాలి. అందులో మెంతిపొడి, ఎండిన ముక్కలు, రసం వేసి బాగా కలపాలి. అంతే... ఘుమఘుమలాడే నిమ్మకాయ నోరూరిస్తూ మీ కోసం!
Tuesday, 19 February 2019
Saturday, 16 February 2019
పచ్చి పులుసు
ఆలూరుకృష్ణప్రసాదు .
పచ్చిపులుసు.
కావలసినవి .
చింతపండు --- 30 గ్రా. లేదా నిమ్మకాయంత.
పెద్ద ఉల్లిపాయలు -- రెండు
ఉప్పు తగినంత
బెల్లం -- 20 గ్రా ( తీపి ఇష్ట పడని వారు బెల్లం వేయకుండా చేసుకొనవచ్చును . )
తరిగిన కొత్తిమీర సరిపడా
పోపు .
ఎండుమిరపకాయలు - 5
జీలకర్ర -- అర స్పూను
నూనె -- రెండు స్పూన్లు
కరివేపాకు - రెండు రెబ్బలు
తయారీ విధానము .
చింతపండు లో నీళ్ళు పోసి పది నిముషములు నాన బెట్టు కోవాలి.
రసం తీసుకొని వడ కట్టుకొని ఒక అర లీటరు ప్రమాణం వచ్చేలా అందులో నీళ్ళు కలుపు కోవాలి .
ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
అందులో తగినంత ఉప్పు మరియు బెల్లం పొడి చేసి కలుపుకోవాలి .
ఉల్లిపాయలు సన్నని ముక్కలుగా తరిగి అందులో కలుపుకోవాలి.
సన్నగా తరిగిన కొత్తిమీర అందులో కలుపుకోవాలి.
స్టౌ మీద బాండి పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే ఎండుమిరపకాయలు , జీలకర్ర వేసి వేగాక కరివేపాకు కూడా వేసి వేయించు కోవాలి .
తర్వాత మిక్సీలో ఈ వేగిన పోపు వేసి మెత్తగా పొడి చేసుకొని ఆ పొడి పచ్చి పులుసు లో వేసి గరిటతో బాగా కలుపుకోవాలి .
ఉల్లిపాయలు వేయించనక్కర లేదు .
పులుసు వెచ్చబెట్టే అవసరం లేదు .
ఇంక వేరే పోపు వేయనక్కర లేదు.
పచ్చి మిర్చి వేయనక్కర లేదు .
ఇంగువ వేసే అవసరం లేదు.
ఎంతో రుచిగా ఉండే పచ్చి పులుసు రెడీ .
కాంబినేషన్ గా కందిపొడి గాని , కంది పచ్చడి కాని చాలా రుచిగా ఉంటుంది .
పచ్చి ఉల్లిపాయలు తినడం ఇష్టం లేని వారు , ఉల్లిపాయల ముక్కలు బాండీ లో రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి పులుసులో కలుపుకోండి.
మిగిలిన పద్థతి పై చెప్పిన విధముగానే.