Saturday, 2 March 2019

Maddur vada మద్దూర్ వడ

కొత్తగా ఏదైనా వండాలి అనిపించింది. త్వరగా అయ్యేది ‘ మద్దూర్ వడ’ గుర్తుకొచ్చింది.

తయారీ:
1/2 కప్పు బియ్యంపిండి, 1/2 కప్పు మైదా పిండి, 1/4 కప్పు శనగపిండి , 2 చంచాల పచ్చిమిర్చితరుగు, 4 చంచాల కొతిమేర, 1 చంచా mirchi flakes, 1/2 కప్పు వుల్లితరుగు1 చంచా అల్లం తరుగు, 1/2 థనియా, 1/2 చంచా జీర powders, 6 చంచాల జీడిపప్పు ముక్కలు, 4 చంచాల వేడి నూనె, తగిన వుప్పు వేసి నీళ్ళు పోసి గట్టిగా ‘ పప్పుచక్కల ‘ పిండి మాదిరి క లుపు కోవాలి. చేతికి నూనె రాసుకొన చిన్న
వుండలుగా చేసి పెట్టు కోవాలి.

భాళ్ళీ వేడిచేసి తగిన నూనె వేసి నూనె కాగాక వుండలని
చక్కల మాదిరి plastic
Paper పై తట్టి నూనె లో వేసి వేయించి Golden  brown colourరాగానే తీసి tissue paper లో పెట్టు కోవాలి.  అన్ని వండిన తరువాత చక్కగా అందమైన tiffin plate లో పెట్టుకొని మాగాయతోనో, అల్లంపచ్చడితోనో తింటే.......ఆనందం....బ్రహ్మనందం.

Tuesday, 19 February 2019

నిమ్మకాయ నిల్వ పచ్చడి

నిమ్మకాయలు కడిగి ఆరబెట్టాలి. తరువాత ఒకొక్క కాయని నాలుగు లేదా ఎనిమిది ముక్కలు చేసి, తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. 3వ రోజు ఉదయం ముక్కలు చేత్తో గట్టిగా పిండి ఎండలో పెట్టాలి. అలాగే ఊరిన రసం కూడా వేరేగా వెడల్పాటి గిన్నెలో పోసి ఎండలో పెట్టాలి. అలా రెండు మూడు రోజులు ఎండ పెట్టాలి. ఆ తర్వాత, ఒక చెంచాడు మెంతులు వేయించి, పొడి చేసుకోవాలి. అపుడు మూకుడులో గరిటెడు నూనె పోసి కాగాక అందులో ఆవాలు, మెంతులు వేయించి పక్కన పెట్టుకోవాలి. కొద్ది సేపు తరువాత అందులో కారం పొడి తగినంత వేసి కలిపి దించేయాలి. అందులో మెంతిపొడి, ఎండిన ముక్కలు, రసం వేసి బాగా కలపాలి. అంతే... ఘుమఘుమలాడే నిమ్మకాయ నోరూరిస్తూ మీ కోసం!

Saturday, 16 February 2019

పచ్చి పులుసు

ఆలూరుకృష్ణప్రసాదు .

పచ్చిపులుసు.

కావలసినవి .

చింతపండు  ---  30 గ్రా. లేదా  నిమ్మకాయంత.
పెద్ద ఉల్లిపాయలు --  రెండు
ఉప్పు  తగినంత
బెల్లం  --  20  గ్రా ( తీపి ఇష్ట పడని వారు  బెల్లం  వేయకుండా చేసుకొనవచ్చును . )
తరిగిన  కొత్తిమీర  సరిపడా

పోపు .

ఎండుమిరపకాయలు  - 5
జీలకర్ర   --  అర స్పూను
నూనె  --  రెండు స్పూన్లు
కరివేపాకు   -  రెండు  రెబ్బలు 

తయారీ  విధానము .

చింతపండు   లో  నీళ్ళు  పోసి  పది నిముషములు  నాన బెట్టు కోవాలి.

రసం  తీసుకొని   వడ కట్టుకొని  ఒక  అర  లీటరు  ప్రమాణం  వచ్చేలా  అందులో  నీళ్ళు  కలుపు కోవాలి .

ఒక  గిన్నెలోకి  తీసుకోవాలి.

అందులో  తగినంత   ఉప్పు  మరియు  బెల్లం  పొడి చేసి  కలుపుకోవాలి .

ఉల్లిపాయలు  సన్నని  ముక్కలుగా  తరిగి   అందులో  కలుపుకోవాలి.

సన్నగా  తరిగిన   కొత్తిమీర   అందులో  కలుపుకోవాలి.

స్టౌ మీద  బాండి  పెట్టి  మూడు  స్పూన్లు   నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే  ఎండుమిరపకాయలు , జీలకర్ర   వేసి  వేగాక  కరివేపాకు  కూడా  వేసి  వేయించు కోవాలి .

తర్వాత  మిక్సీలో  ఈ  వేగిన  పోపు  వేసి  మెత్తగా   పొడి  చేసుకొని  ఆ పొడి  పచ్చి పులుసు లో  వేసి  గరిటతో  బాగా  కలుపుకోవాలి .

ఉల్లిపాయలు  వేయించనక్కర  లేదు .
పులుసు  వెచ్చబెట్టే  అవసరం లేదు .
ఇంక  వేరే  పోపు  వేయనక్కర  లేదు.
పచ్చి మిర్చి  వేయనక్కర లేదు .
ఇంగువ  వేసే  అవసరం  లేదు.

ఎంతో  రుచిగా  ఉండే  పచ్చి  పులుసు  రెడీ .

కాంబినేషన్ గా  కందిపొడి  గాని , కంది పచ్చడి కాని చాలా రుచిగా  ఉంటుంది .

పచ్చి ఉల్లిపాయలు  తినడం ఇష్టం లేని వారు ,  ఉల్లిపాయల  ముక్కలు  బాండీ లో రెండు స్పూన్లు  నూనె వేసి నూనె  బాగా కాగగానే  ఉల్లిపాయ  ముక్కలు వేసి  పచ్చి వాసన పోయే వరకు  వేయించి  పులుసులో  కలుపుకోండి.

మిగిలిన  పద్థతి  పై చెప్పిన విధముగానే.

Tuesday, 8 January 2019

మజ్జిగ పులుసు

మజ్జిగ   పులుసు.

తయారు  చేయు  విధానము .

ముందుగా అర లీటరు  పెరుగు చక్కగా కవ్వంతో గిలకొట్టి  గడ్డలు లేకుండా  చూసుకుని తగినన్ని నీళ్ళు పోసుకుని వెడల్పాటి గిన్నెలో ప్రక్కన  పెట్టి ఉంచుకోవాలి,

పుల్లగా ఇష్టమైన వాళ్ళు పుల్లని పెరుగు వాడుకోవచ్చు.

అందులో పావు టీ స్పూన్ పసుపు కలిపి గరిటతో బాగా కలపండి.

ముందుగా చిన్న గిన్నెలో రెండు స్పూన్లు పచ్చి శనగపప్పు , స్పూను  చాయపెసరపప్పు , స్పూను  బియ్యం ,పావు స్పూను లో సగం ఆవాలు. చిన్న అల్లంముక్క, చిన్న పచ్చి కొబ్బరిముక్కను వేసి  పావు గ్లాసు  నీళ్ళు పోసి ఒక గంట సేపు నానబెట్టి ,  ఆ తర్వాత ఆ నీళ్ళతో సహా మెత్తగా మిక్సీ వేసుకున్నాక ఆ ముద్దని మజ్జిగ  లో కలపండి.

నాలుగు పచ్చిమిరపకాయలు  తీసుకుని నిలువుగా చీలికలు  గా తరిగి మజ్జిగ ముద్దలో వేయండి.

కరివేపాకు  రెండు రెమ్మలు తీసుకుని ఆకులు  దూసుకుని  కడిగి మజ్జిగ  లో వేయండి.

తగినంత ఉప్పు వేసి అన్నీ బాగా కలపండి.

ఇప్పుడు రెండు ఎండు మిరపకాయలు . కొద్దిగా మెంతులు. కొద్దిగా జీలకఱ్ర . ఆవాలు కొద్దిగా  వేసి  కొంచెం కరివేపాకు  వేసి కొంచెం నూనె వేసి పోపు పెట్టి మజ్జిగ లో కలపండి.

పావు కిలో ఆనపకాయ ముక్క పై చెక్కు  తీసుకుని  ముక్కలుగా  తరుగు కోవాలి.

రెండు క్యారెట్ లు  పై చెక్కు తీసుకుని  ముక్కలుగా  తరుగు కోవాలి.

రెండు టమోటో లు  ముక్కలుగా  తరుగుకుని  మజ్జిగ  పులుసులో వేసుకోవాలి.

ఆనపకాయ ముక్కలు  మరియు క్యారెట్ ముక్కలు  తగినన్ని  నీళ్ళు పోసుకుని    విడిగా కుక్కర్ లో మెత్తగా  ఉడికించి బాగా చల్లారాక మజ్జిగ లో కలపండి.

ఇప్పుడు  ఈ  మజ్జిగ  పులుసును
stove మీద పెట్టి పొంగకుండా గరిటతో బాగా కలుపుతూ బాగా మరగ నివ్వండి.

క్రింద పొంగితే  పై  నురుగు లోని  tase  పోతుంది .

బాగా తెర్లాక క్రిందకు దింపి కొత్తిమీర కడిగి సన్నగా తుంపి కడిగి మజ్జిగ  దింపిన పులుసు లో వేసి  మూత పెట్టి ఉంచాలి .

వేడి   వేడి అన్నంలో కలుపుకుని తింటే  ఆ  రుచి  అద్భుతం .

ఒక్క విషయం అన్నీ వేసాక stove మీద ఎందుకు  పెట్టమన్నానంటే ముందుగానే  పెడితే  మజ్జిగ  పులుసు విరిగిపోతుంది.

లేదా  మజ్జిగ  పులుసు తెర్లాక క్రిందకు  దింపి  పోపు గరిటెలో  పోపు వేసుకుని , పోపు చల్లారాక పులుసులో కలపాలి .

అప్పుడు  మజ్జిగ  పులుసు విరగదు.

Saturday, 29 December 2018

ఆలూ ఫింగర్స్

ఉడికించిన బంగాళా దుంపల ముద్దలో , ఉడికించించిన రవ్వ కూడా కలపి, ఉప్పు, కారం, మసాలా, వాము, కొత్తిమీర వేసి బాగా కలపి చేతికి నూనె రాసుకుని కొంచం ఆ mixture తీసుకుని పొడుగ్గా ఫింగర్స్ ల చేసుకుని వేడి వేడి నూనె లో కొన్ని కొన్ని వేసే బాగా డీప్ ఫ్రై చేయాలి.

Monday, 17 December 2018

పొంగలి

పొంగల్ . (  Ven  Pongal  )

తమిళ నాడు  అంతటా  ప్రతి రోజు  హోటళ్ళలో ఉప్మా  చేయరు.
పొంగల్  చేస్తారు .

కారణం  బొంబాయి రవ్వ , మైదా  పిండి  ఆరోగ్యరిత్యా  తగు  మోతాదులో   ఉపయోగించు  కోవాలని  అందరూ  చెప్తున్నారు .

ఈ  పొంగల్  బియ్యముతో  చేసుకుంటారు  కాబట్టి  ఆరోగ్యానికి  చాలా  మంచిది .

ఇంక  పొంగల్  తయారు  చేయడానికి  కావలసిన  వస్తువులు .

బియ్యము  --  ఒక  గ్లాసు
చాయపెసరపప్పు  --  అర  గ్లాసు
మిరియాలు  --   ఒకటిన్నర   స్పూను .
నెయ్యి  ---   ఒక  చిన్న  కప్పు.
ఉప్పు  --   తగినంత
అల్లం తరుగు  --  ఒకటిన్నర   స్పూను  జీలకర్ర   --  అర  స్పూను .
జీడిపప్పు  ---  30  గ్రాములు
కరివేపాకు   -  మూడు  రెమ్మలు 
పచ్చిమిర్చి   --  ఐదు  పొడుగ్గా   తరుగు కోవాలి .
ఇంగువ  ---   కొద్దిగా

ముందుగా  బియ్యాన్ని  , పెసరపప్పును  మునిగే వరకు  నీళ్ళు పోసి ఒక  గంట సేపు విడి  విడిగా  నానబెట్టు కోవాలి .

స్టౌ  వెలిగించి  బాండీ  పెట్టుకొని  మూడు  స్పూన్లు  నెయ్యి  వేసి   జీడిపప్పు ను  వేయించుకొని  పక్కన  పెట్టుకోవాలి .  

మిరియాలను  కొంచెం  కచ్చా పచ్చాగా  దంచుకొని  ఒక  ప్లేటులో  పెట్టుకోండి.

అదే  బాండిలో  మరో  రెండు స్పూన్లు   నెయ్యి వేసి  దంచి  పెట్టుకున్న  మిరియాలు  , జీలకర్ర  , అల్లం తరుగు ,  ఇంగువ , పచ్చి  మిర్చి  , కరివేపాకు  వేసి  పోపు వేగాక  ఒకటి  మూడు  చొప్పున  నీళ్ళు పోసి   అందులో  తగినంత   ఉప్పు వేసి అదే  నీళ్ళలో  నానబెట్టి  ఉంచుకున్న   బియ్యము  పెసరపప్పు  వేసి  మూత పెట్టి  మెత్తగా   ఉడకనివ్వాలి .

దింప బోయే  ముందు  మిగిలిన  నెయ్యి ,  వేయించి  ప్రక్కన  పెట్టుకున్న  జీడిపప్పు   వేసి  మరో  మూడు  నిముషాలు  ఉంచి  దింపు కోవాలి .

వేడి  వేడి  పొంగల్  సర్వింగ్  కు సిద్ధం .

ఇందులోకి  కొబ్బరి  చట్నీ ,  టమోటో  చట్నీ  రెండూ  బాగుంటాయి .

తమిళనాడు  అంతటా  అన్ని హోటళ్ళలోనూ  చక్కగా  లేత  అరిటాకు వేసి  పొంగల్  పెట్టి   పై రెండు  చట్నీలు  వేసి , వేడి  వేడిగా  పొగలు  కక్కుతున్న  సాంబారు  వేస్తారు .

ఎంత  రుచిగా  ఉంటుందో  !

మళ్ళీ  మధ్యాహ్నము  ఒంటి గంట  దాకా  ఆకలి  వెయ్యదు .

Tuesday, 11 December 2018

మీగడ జంతికలు

బియ్యపు పిండితో రుచికరమైన మీగడ చక్కిలాలు /  జంతికలు .

ఆలూరుకృష్ణప్రసాదు .

బియ్యపు పిండితో  మీగడ  చక్కిలాలు.

కావలసినవి .

మర పట్టించిన బియ్యపు  పిండి --  నాలుగు  కప్పులు.

బియ్యము  నాన పెట్టే అవసరం లేదు.

మామూలు బియ్యమే  మర పట్టించాలి.

మీగడతో ఉన్న పెరుగు  --  ఒక కప్పు.

(  జంతికలు  పుల్లగా  తినడానికి  ఇష్ట పడే వారు  పుల్లని మీగడ పెరుగు  వేసుకోవచ్చును. )

మీగడ  పెరుగు  లభ్యం కాని యెడల  50 గ్రాముల  వెన్న  పిండి కలిపే సమయంలో వేసుకుని , మామూలు పెరుగు వేసుకుని  పిండి కలుపు కోవచ్చు.

ఉప్పు  -- తగినంత

కారము  -- ఒక స్పూను

వాము   --  ఒక  స్పూను

నువ్వుపప్పు  -  ఒక  స్పూను

నూనె   --  350  గ్రాములు.

తయారీ  విధానము .

ఒక  బెసిన్లో మెత్తగా  మరపట్టించి జల్లెడ పోసుకున్న   బియ్యపు  పిండి ,  వాము , నువ్వుపప్పు , కారం,  వేసుకుని  అందులో  మీగడ పెరుగు / లేదా  వెన్న  మరియు పెరుగు వేసుకుని  తగినంత  ఉప్పు వేసుకుని చేతితో  బాగా  కలుపు కోవాలి .

ఇప్పుడు  అవసరమైతే కొద్దిగా   నీళ్ళు పోసుకుంటూ  చక్కిలాలు  వేయటానికి  వీలుగా  పిండిని  గట్టిగా  కలుపుకోవాలి .

తర్వాత   కలిపిన  పిండిని  బాగా మెదాయించుకోవాలి.

ఇప్పుడు   స్టౌ  వెలిగించి   బాండి పెట్టుకుని  మొత్తము   నూనె  పోసి  నూనెను  పొగలు  వచ్చే విధముగా  బాగా  కాగనివ్వాలి.

తర్వాత  పిండిని  చక్కిలాలు  వేసుకునే  గిద్దలో  పెట్టుకుని  స్టౌ ను  మీడియం  సెగలో  పెట్టి  రెండు  రెండు  చొప్పున  చక్కిలాలు నూనెలో వేసుకుని బంగారు  రంగులో  వేయించుకుని  తీసేసుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా ఉండే చల్ల చక్రాలు /  మీగడ చక్రాలు  అల్పాహారానికి  సిద్ధం.

ఈ  చక్కిలాలు  పది రోజులు   పైన నిల్వ ఉంటాయి.